Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సందీప్ కిషన్ కొత్త చిత్రం.. వంశీకృష్ణ దర్శకత్వంలో..
‘బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉహేలి (బెంగాలీ) చిత్రాల నిర్మాతల్లో రూపేష్ డీ గోహిల్ ఒకరు. తాజాగా యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా సోలో నిర్మాతగా సినిమాను రూప
'బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం', 'సినిమా చూపిస్త మావ', 'ఉహేలి (బెంగాలీ) చిత్రాల నిర్మాతల్లో రూపేష్ డీ గోహిల్ ఒకరు. తాజాగా యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా సోలో నిర్మాతగా సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకొన్న వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ తాజా సినిమా రూపొందనున్నది.
ఈ సందర్భంగా నిర్మాత రూపేష్ డీ గోహిల్ మాట్లాడుతూ ఇంతకు మునుపు పార్ట్ నర్ షిప్తో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, సినిమా చూపిస్త మావ, ఉహేలి (బెంగాలీ) అనే సినిమాలను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాతగా సందీప్ కిషన్ హీరోగా సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి అభిరుచి ఉన్న సినీ కథా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ చెప్పిన కథ నచ్చింది. సకుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువలున్న వినోదాత్మక చిత్రమవుతుంది అని అన్నారు.
జులై 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగాన్ని హైదరాబాద్లోనే తెరకెక్కిస్తాం. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: రథన్, కెమెరా: భలే భలే మగాడివోయ్ ఫేమ్ నిజర్ షఫి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్