Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
కనితన్ రీమేక్ లో నటిస్తున్న నిఖిల్
ఇటీవల కిరాక్ పార్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం తమిళ సినిమా కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోని పూర్తి కథను కాకుండా.. కేవలం లైన్ మాత్రమే తీసుకుని ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకేక్కిస్తుండడం విశేషం.
కనితన్ రీమేక్ లో నటిస్తున్న నిఖిల్
ఇటీవల కిరాక్ పార్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం తమిళ సినిమా కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోని పూర్తి కథను కాకుండా.. కేవలం లైన్ మాత్రమే తీసుకుని ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకేక్కిస్తుండడం విశేషం.
ఈ సినిమా రవితేజ చెయ్యాలి అనుకున్నాడు
ఈ సినిమాను ముందు రవితేజతో రీమేక్ చేయాలని భావించాడు దర్శకుడు సంతోష్. ముందుగా రవితేజ కూడా ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపించడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు. అనుకోకుండా నిఖిల్ వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లోకి. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.
నిఖిల్ పక్కన నటించడానికి ఒప్పుకొని హీరోయిన్స్
ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిష్టర్ కూడా చేయించాడు ఠాగూర్ మధు. ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా ఇంతవరుకు హీరోయిన్ ఖరారు కాకపోవడం అందరిని ఆచర్యానికి గురి చేస్తుంది. రస్మిక, క్యాథరిన్, శాలిని పండే, హన్సిక ఈ సినిమా చెయ్యమని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఏహీరోయిన్ నిఖిల్ తో చేస్తుందో చూడాలి.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారి ధరకు
ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ఓ లీడింగ్ ఛానెల్ 5.50 కోట్లకు దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే హైయ్యస్ట్ రేట్. ఈ మద్య సినిమాను హైప్ లేపడం కోసం ఫేక్ రేట్స్ క్రియేట్ చేస్తున్నారు కావున ఈ న్యూస్ లో నిజం ఎంతుందో తెలియదు. కిరాక్ పార్టి సినిమా నిఖిల్ కు ఆశించిన స్థాయి విజయం అందించలేదు. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.