Bigg Boss Telugu 7 నాగార్జునను అరెస్ట్ చేయండి.. బిగ్బాస్ షోపై హైకోర్టులో కేసు.. విధ్వంసానికి బాధ్యులు మీరే..
బిగ్బాస్ తెలుగు 7 సీజన్ ప్రశాంతంగా ముగిసింది. అయితే బిగ్బాస్ తెలుగు ఫినాలే తర్వాత అల్లరి మూకలు చేసిన విధ్వంసంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సెలబ్రిటీల కార్లను, అలాగే ఆర్టీసీ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో అధినేత, హోస్ట్ నాగార్జున అక్కినేనిపై అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ చెప్పిన ఈ కేసు వివరాల్లోకి వె ళితే..
Recommended Video

బిగ్బాస్ తెలుగు 7 సీజన్ ఫినాలే రోజున కొందరు సెలబ్రిటీల అభిమానులు ప్రభుత్వం ఆస్తులపై దాడికి పాల్పడ్డారు. సర్కార్ ఆస్తులపై జరిగిన నష్టంపై బిగ్బాస్ తెలుగు 7 నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఈ షోపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం అని అరుణ్ కుమార్ తెలిపారు.

బిగ్బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్ ఓ సాధారణ పౌరుడు. అతడి ప్రతిభతో విజేతగా నిలిచారు. అలాంటి వ్యక్తిపై కేసు ఎలా నమోదు చేస్తారు? ఆస్తుల నష్టానికి అతడేలా బాధ్యత వహిస్తాడు? దాదాపు 8 బస్సుల ధ్వంసం జరిగింది. ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. ఇలాంటి సందర్భంలో 8 బస్సులను ధ్వంసం చేయడం బాధాకరం అని అరుణ్ కుమార్ చెప్పారు.
రియాలిటీ షో పేరుతో బిగ్బాస్ షోలో అమ్మాయిలను 100 రోజులు బంధించి ఈవెంట్ నిర్వహించడం అభ్యంతరం. ఈ విషయాలను మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, మహిళా కమిషన్ చైర్మన్ ఫిర్యాదు చేస్తాను అని అరుణ్ కుమార్ తెలిపారు.

అయితే బిగ్బాస్ తెలుగు 7 ఫినాలే రోజున జరిగిన అల్లర్లు, అన్నపూర్ణ స్టూడియోలో అల్లరి మూకలు చేసిన సంఘటనలకు అక్కినేని నాగార్జున బాధ్యత వహించాలి. బస్సుల దాడి ఘటనలో అమాయకుడైన పల్లవి ప్రశాంత్పై కేసు ఎలా పెడుతారు? ఈ ఘటనకు కారణమైన నాగార్జున, బిగ్బాస్ నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియా అరెస్ట్ చేయాలని అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టుకు దాఖలు చేసిన డిమాండ్లో పేర్కొన్నట్టు తెలిసింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











