Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ఒక్క సీన్ గురించి తెలిస్తే 'సాహో' అనాల్సిందే.. ఇదీ ప్రభాస్ రేంజ్
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మరో భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి సినిమాతో రికార్డుల సునామీ సృష్టించిన ఆయన మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. దేశమంతా ప్రభాస్ భారీ ప్రాజెక్టు 'సాహో' కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో 'సాహో' సినిమా గురించిన కొన్ని అప్డేట్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నింపుతున్నాయి.
అబుదాబిలో షూటింగ్
పూర్తి స్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా భారీ యాక్షన్ సన్నివేశాలు సాహో లో చూడనున్నారు ప్రేక్షకులు. దేశ విదేశాల్లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగ్గర్లు పొడిచే రీతిలో ఉంటాయని చిత్రయూనిట్ అంటోంది. సినిమాలోని యాక్షన్ పార్ట్లో కొన్ని కీలక సన్నివేశాన్ని అబుదాబిలో షూట్ చేసిన సంగతి తెలిసిందే.
8 నిమిషాలు 70 కోట్లు.
అబుదాబిలో చిత్రీకరించిన ఈ యాక్షన్ సన్నివేశం 8 నిమిషాల పాటు ఉండనుంది. కేవలం ఈ సన్నివేశం కోసమే 70 కోట్లు ఖర్చు చేశారు సాహో నిర్మాతలు. ఈ సన్నివేశంలో భాగంగా వచ్చే చేజింగ్ సీన్ గతంలో ఎన్నడూ ఏ చిత్రంలోనూ చూసి ఉండరని అంటోంది చిత్రయూనిట్. కేవలం ఒకే ఒక సన్నివేశాన్ని ఇంత భారీ ఖర్చుతో తెరకెక్కించడం అంటే ఆ సన్నివేశానికి సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్
ఇటీవలే టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సాహో టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చిత్రానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో టెక్నీషియన్స్ చాలా కేర్ గా వ్యవహరిస్తున్నారట. క్లాస్, మాస్ ఆడియన్స్ని అబ్బురపరిచేలా విఎఫ్ఎక్స్ మిక్సింగ్ జరుగుతోందట. సాహో సినిమా ద్వారా ప్రభాస్ రేంజ్ మరోసారి ఎల్లలు దాటించాలని పట్టుగా ఉందట సాహో టీమ్.
సాహో మూవీ రిలీజ్ డేట్.. వరల్డ్ ఆడియన్స్ క్రేజ్
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో మూవీ తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, చుంకీ పాండే లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో పాలు పంచుకుంటున్నారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపు సాహో పై ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి హై రేంజ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది చిత్రయూనిట్. ఆగస్టు 15 వ తేదీన భారీ అంచనాల నడుమ సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.