Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ ఇంటిని కూల్చొద్దు.. కాస్త ఊరట.. ఇంకా వీడని చిక్కుముడి!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఊహించని సమస్య ఎదురైంది. దీని వలన ప్రభాస్ కోర్టులో న్యాయ పోరాటం చేయవలసి వస్తోంది. హైదరాబాద్ రాయదుర్గం సమీపంలో పన్మక్తా గ్రామ సమీపంలో ప్రభాస్ ఓ గెస్ట్ హౌస్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇల్లు ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ నేడు హై కోర్టులో జరిగింది. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రభాస్ కు స్వల్ప ఊరట కలిగించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ భూమిలో
హైదరాబాద్ లోని రాయదుర్గం సమీపంలో సర్వే నెం 46లో గల 80 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే ప్రాంతంలో ప్రభాస్ ఇల్లు కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న కట్టడాలని కూల్చేయమని ఇటీవల తహసీల్దారు ఆదేశాలు జరీ చేశారు. దీనితో ప్రభాస్ కోర్టుని ఆశ్రయించాడు.
ఎలాంటి నోటీసులు లేకుండా
తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇంటిని కూల్చేయమని ఎలా ఆదేశాలు జారీ చేస్తారు అంటూ ప్రభాస్ ఫిటిషన్ లో పేర్కొన్నాడు. ప్రభుత్వం ప్రభాస్ ఇంటిని సీజ్ చేసింది. దీనిపై హై కోర్టులో నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణని డిసెంబర్ 31కి వాయిదా వేసింది. అప్పటివరకు కట్టడాలు ప్రభాస్ ఇంటిని కూల్చకుండా యధాస్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
గెస్ట్ హౌజ్ సీజ్: హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్
కౌంటర్ దాఖలు చేయాలి
అదే విధంగా ఈ నెల 24న ప్రభాస్ పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరుపున న్యాయవాది మాట్లాడుతూ తాము ప్రభాస్ ఇంటిని కూల్చలేదని, కేవలం సీజ్ మాత్రమే చేసాం అని కోర్టుకి వివరించారు. ప్రభాస్ ఇల్లు వివాదంలో ఉండడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
క్రేజీ చిత్రాలతో
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్. సుజిత్ ఈ చిత్రాన్ని కళ్ళు చెదిరే యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా ప్రభాస్నటిస్తున్నాడు. 1960 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.