Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైజాగ్ కత్తితో తో పెట్టుకుంటున్నావని మర్చిపోవద్దు...
బుల్లి తెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షఓలను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం 'సై ఆట". ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది..ఈ చిత్రంపై ఛార్మి ఎన్నో ఆశలు పెట్టుకుంది..అన్నట్టు ఈ చిత్రంలో ఛార్మి పేరు 'మల్లీశ్వరి". మంచి గడుసరి విలన్ ని కూడా ఓ రేంజ్ లో హడలెత్తింస్తుంది. మల్లీశ్వరిని ఎవరైనా కదిలిస్తే ..వైజాగ్ కత్తితో మాట్లాడుతున్నామని మర్చిపోవద్దు..కసకసా పొడిచేస్తా..అంటుందట..ఈ సినిమా కనుక నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఆ కసకసా ఏమౌవుతుందో..!
ఎందుకంటే ఎంత ట్రై చేసినా అవకాశాలు రావడం లేదు..ఏదో..కాస్త ఈ చిత్రమైనా హిట్ అయితే నాలుగు అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్న ఛార్మి సై ఆట తనకి సై అనిపిస్తుందని భావిస్తుంది. ఈ సినిమా ప్రివవ్వ్యూ చూసిన వారు మల్లీశ్వరి పాత్ర ఛార్మికి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది, సినిమా చాలా బాగా ఉందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సింది.
ఈ చిత్రంలో చార్మి సరసన అజయ్ హీరోగా చేస్తున్నారు. నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక చార్మి ప్రస్తుతం మంత్ర దర్శకుడు తులసీరామ్ డైరక్షన్ లో మంగళ అనే చిత్రం చేస్తోంది. దీనితో పాటు సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న సేవకుడు లోనూ చేస్తోంది.