Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవితో పోటీకి ఇద్దరు బాలీవుడ్ హీరోలు రెడీ.. రామ్ చరణ్కు దెబ్బేస్తారా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న ఈ సినిమా స్ట్లైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కొణెదల ఆర్ట్స్ బ్యానర్పై చిరు తనయుడు, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్, అనుష్క తదితరులు నటిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటించారు.
ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయాలని భావిస్తున్నారు. 8న విజయదశమి ఉండడంతో లాంగ్ వీకెండ్ బాగా క్యాష్ చేసుకోవచ్చని నిర్మాత భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగా చిత్ర బృందం వేగంగా పనులు సాగిస్తోంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్కు భారీ స్పందన రావడంతో పాటు సినిమా హక్కులకు డిమాండ్ ఉంది. దీంతో చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉంది. ఇలాంటి సమయంలో 'సైరా' యూనిట్ను షాక్కు గురి చేసే న్యూస్ ఒకటి తెలిసింది.
బాలీవుడ్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి ఓ మల్టీ స్టారర్లో నటించిన విషయం తెలిసిందే. 'వార్' అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాను యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. యాక్షన్ జోనర్గా వస్తున్న 'వార్'ను సిద్దార్ద్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.
సోమవారం 'వార్' టీజర్ విడుదలైంది. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఈ టీజర్లోనే చూపించేశారు. దీని చివర్లో అక్టోబర్ 2న విడుదల కాబోతుందని యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే తెలుగు టీజర్ను కూడా విడుదల చేసింది. అంటే.. 'సైరా' విడుదలయ్యే రోజే 'వార్' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నటించిన హృతిక్కు తెలుగులోనూ మంచి ఫాలోయింగే ఉంది. దీంతో 'సైరా' వసూళ్లపై ఈ సినిమా ఎఫెక్ట్ కొంచెమైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.