Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పోసాని 'నిత్య పెళ్ళి కొడుకు' ఆపుచేస్తే ఆమరణ నిరాహార దీక్ష
పోసాని కృష్ణ మురళి హీరోగా రెడీ అయ్యి విడుదలకు సిద్దమైన చిత్రం నిత్య పెళ్ళి కొడుకు...కేరాఫ్ జగదాంబ సెంటర్. ఈ చిత్రం విడుదలను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్డుకుంటోందని నిర్మాత జివీ సుబ్బయ్య ఆరోపించారు. మంగళవారం చిత్ర దర్శకుడు అళహరితో కలిసి ఆయన మాట్లాడుతూ...సెవెన్ హిల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిలిం ఛాంబర్ అనుమతితోనే ప్రారంభించామన్నారు. తీరా వచ్చే నెల 10 న విడుదలకు సిద్దమైన తరుణంలో టైటిల్ లోని జగదాంబ సెంటర్ ను తొలిగించమని సూచించారని..అది తమను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
వారం లోగా తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఛాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడాతనని దర్శకుడు అళహరి హెచ్చరించారు. ఇక ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమ్మాయి అందానికి ప్రాధాన్యతనిస్తారా, గుణానికి ప్రాధాన్యతనిస్తారా అనే పాయింట్ తో 'నిత్య పెళ్లికొడుకు' చిత్రం రెడీ అయింది. ఈ చిత్రానికి కల్పన, ఐడీపీఎల్ నిర్మల, అపూర్వ, ప్రసన్నకుమార్, జీవీ సుబ్బయ్య, జెన్నీ, శైలజ, లత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు దీపికా రాజు, శైలకుమార్ అందించగా, కెమెరా... గాదిరాజు శ్రీను, ఎడిటింగ్ సాయి శ్రీనివాస్, థ్రిల్స్ సతీశ్, కళ కె. విజయ్కృష్ణ సమకూరుస్తున్నారు.