twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోసాని 'నిత్య పెళ్ళి కొడుకు' ఆపుచేస్తే ఆమరణ నిరాహార దీక్ష

    By Srikanya
    |

    పోసాని కృష్ణ మురళి హీరోగా రెడీ అయ్యి విడుదలకు సిద్దమైన చిత్రం నిత్య పెళ్ళి కొడుకు...కేరాఫ్ జగదాంబ సెంటర్. ఈ చిత్రం విడుదలను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్డుకుంటోందని నిర్మాత జివీ సుబ్బయ్య ఆరోపించారు. మంగళవారం చిత్ర దర్శకుడు అళహరితో కలిసి ఆయన మాట్లాడుతూ...సెవెన్ హిల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిలిం ఛాంబర్ అనుమతితోనే ప్రారంభించామన్నారు. తీరా వచ్చే నెల 10 న విడుదలకు సిద్దమైన తరుణంలో టైటిల్ లోని జగదాంబ సెంటర్ ను తొలిగించమని సూచించారని..అది తమను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.

    వారం లోగా తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఛాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడాతనని దర్శకుడు అళహరి హెచ్చరించారు. ఇక ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమ్మాయి అందానికి ప్రాధాన్యతనిస్తారా, గుణానికి ప్రాధాన్యతనిస్తారా అనే పాయింట్ తో 'నిత్య పెళ్లికొడుకు' చిత్రం రెడీ అయింది. ఈ చిత్రానికి కల్పన, ఐడీపీఎల్ నిర్మల, అపూర్వ, ప్రసన్నకుమార్, జీవీ సుబ్బయ్య, జెన్నీ, శైలజ, లత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు దీపికా రాజు, శైలకుమార్ అందించగా, కెమెరా... గాదిరాజు శ్రీను, ఎడిటింగ్ సాయి శ్రీనివాస్, థ్రిల్స్ సతీశ్, కళ కె. విజయ్‌కృష్ణ సమకూరుస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X