Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మొగుడే విలనయ్యాడంటున్న మనీషా కొయరాలా
భర్తే శతృవుగా మారితే ఏ స్త్రీ అయినా చేసేదేముంటుంది అంటూ రీసెంట్ గా మాజీ స్టార్ హీరోయిన్ మనీషా కొయరాలా తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. పెళ్ళైన ఆరు నెలలకే మొగుడు పెళ్ళాల మధ్య విభేదాలు చోటు చేసుకోవటంతో ఆ మధ్య ఆమె ఆ విషయాన్ని రాసి వెంటనే కాస్సేపటికి తీసేసి, ఏదో కోపంలో ట్వీట్ చేసాను అంది. అయితే ఆమె ఇప్పుడు వివాహం పెద్ద సమస్యగా మారిందని, త్వరలో విడాకులు తీసుకోబోతోందని తెలుస్తోంది. అందుకే ఆమె వెంటనే మళ్ళీ తల్లి పాత్రలకు వచ్చి సినిమాలు చేయటం మొదలెట్టింది. ఆమెకు పరిశ్రమలో ఉన్న రిలేషన్సే ఆమె పర్శనల్ లైఫ్ ని నాశనం చేస్తోందంటున్నారు. పెళ్ళికి ముందు గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనని వ్యక్తం చేసిన ఆమె వర్తమానం వదిలేసి తన సిని పరిచయాలతో కాలం గడుపుతూండటంతో తట్టుకోలేని ఆమె సీరియస్ అవ్వటంతో మనీషా సమస్యలో పడింది. ప్రస్తుతం ఆమెను మణిరత్నం ఆయన తీయబోయే రొమాంటిక్ కామిడీలో తీసుకుంటానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తన తరంలో ఉన్న దర్శక, నిర్మాతలు ఇంకా సినిమాలు తీస్తుంటే వారిని కలిసి ఆఫర్స్ సంపాదించే పనిలో ఉంది మనీషా.