Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మా’ లొల్లి: 10 వేల జరిమానా, పైకోర్టుకు కళ్యాణ్
హైదరాబాద్: ‘మా' ఎన్నికలపై కోర్టు కెక్కిన నటుడు ఓ. కళ్యాణ్కు సిటీ సివిల్ కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. అంతేకాకుండా రూ. 10 వేల రూపాయల జరిమానా కూడా విధించినట్లు సమాచారం. తీర్పు అనంతరం ఓ.కళ్యాణ్ స్పందిస్తూ మా ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయ, సిటీ సివిల్ కోర్టు తీర్పును పై కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు.
కళ్యాణ్ పిటీషన్ కొట్టి వేయడంతో పాటు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల ఫిలితాలు విడుదలకు కోర్టు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు సాయంత్రంగానీ, శుక్రవారం గానీ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి జయసుధ, రాజేంద్రప్రసాద్ లలో గెలుపు ఎవరిని వరిస్తుందనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మా ఎన్నికల ఫలితాల పైన సిటీ సివిల్ కోర్టు బుధవారం ఉదయం తీర్పు చెప్పడంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది. ఎన్నికల విషయంలో కేసు వేసిన ఓ కళ్యాణ్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల ఫలితాలు విడుదల పైన రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని వెల్లడించింది. ఫలితాలు ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చునని తేల్చి చెప్పింది.