Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రీసెంట్గా ఫోన్ చేసి.. అంతలోనే విషాదం మిగిల్చాడు.. వేణుమాధవ్ భౌతికకాయం వద్ద హైపర్ ఆది
Recommended Video
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడిన వేణుమాధవ్.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో యావత్ సినీ, రాజకీయ వర్గాలు కలత చెందాయి. సినీ ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్లో ఉంచారు.
పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి
ఫిలింఛాంబర్లో ఉంచిన వేణుమాధవ్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సినీ తారలు తరలి వస్తున్నారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులంతా వేణుమాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులు, సినీ తారలతో ఫిలింఛాంబర్ ఆవరణ కిటకిటలాడుతోంది.
మాలాంటి కొత్త కామెడియన్లకు స్ఫూర్తి
వేణుమాధవ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన హైపర్ ఆది మీడియాతో మాట్లాడాడు. ''వేణుమాధవ్ అన్న మాలాంటి కొత్త కామెడియన్లకు ఎంతో స్ఫూర్తి. జబర్దస్త్ లో కూడా చాలామంది కామెడియన్లకు ఫోన్ చేసి వెన్నుతట్టేవారు. షూటింగ్ దగ్గరికి కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు'' అని అన్నాడు హైపర్ ఆది.
రీసెంట్గా ఫోన్ చేసి..
రీసెంట్గా తనకు ఫోన్ చేసి వాళ్ళ చుట్టాలబ్బాయికి జబర్దస్త్లో ఓ స్కిట్ లో ఛాన్స్ ఇవ్వమని అడిగారని చెప్పాడు హైపర్ ఆది. మమ్మలి ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వెన్నుతడుతూ ఉండే వేణు మాధవ్ గారికే ఇలా జరగడం చాలా బాధాకరం. అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అని అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు హైపర్ ఆది.
వేణు మాధవ్ని చూసి బోరున విలపించిన ఉదయభాను
వేణు మాధవ్ భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చిన సీనియర్ యాంకర్ బోరున విలపించింది. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాన్నేరు మున్నీరైంది. వేణు మాధవ్ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించులేకపోయింది ఉదయభాను. వేణు మాధవ్ మరణం సినీ లోకానికి, తమ కుటుంబానికి తీరని లోటు అని చెప్పింది.