జయప్రద మళ్ళీ మేకప్ వేసుకుని తెరకెక్కుతోంది
ప్రపంచంలోనే అధ్బుతమైన సౌందర్యరాశి అని ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే చేత ప్రశంసలు అందుకున్న జయప్రద ఈ మధ్య కాలంలో నటనకు దూరమై కేవలం రాజకీయాలకే పరమితమయ్యారు. అయితే తాజాగా ఆమె ఓ మళయాళ చిత్రం కమిటైంది. ప్రముఖ మళయాళంలో బ్లెస్లి దర్శకత్వంలో ఆమె కథ నచ్చి కమిటైంది. ఈ చిత్రం కథ మూడు ప్రధాన పాత్రలు చుట్టూ తిరుగుతుంది. అనుపమ్ ఖేర్, జయప్రద, మోహన్ లాల్ లు ఈ మూడు పాత్రలు పోషించబోతున్నారు. ఈ ముగ్గురి మధ్య సాగే చిత్రమైన ప్రేమకధ ఈ సినిమా ఇతివృత్తంగా చెబుతున్నారు. కధ విన్న వెంటనే ఈ ముగ్గురు నటులు అంగీకరించారని దర్శకుడు చెప్పారు. రెండువేల సంవత్సరంలో జయప్రద దేవదూతన్ అనే మళయాళ సినిమాలో చివరిసారిగా కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ఈ భాషలో నటిస్తున్నారని ఆమె అబిమానులు ఆనందపడుతున్నారు.


Click it and Unblock the Notifications











