Don't Miss!
- News Nita ambani సెంటిమెంట్: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని.. ఆపై!!
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
ఇష్టం లేకపోయినా చేస్తున్నా:రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏం ట్వీట్ చేసినా అది హాట్ టాపిక్కే. తాజాగా ఆయన తాను తనకు రాత్రి సీన్స్ షూటింగ్ చేయటం ఇష్టం ఉండదని,కానీ తప్పనిసరిగా ఫోర్స్ చేసి చేస్తున్నా అంటూ ట్వీట్ చేసారు. అయితే రాత్రి వేళ షూటింగ్ చేస్తేనే మంచి ఎఫెక్ట్ ఇస్తుందని అన్నారు. అలాగే ప్రస్తుతం స్లో మోషన్ సీన్స్ తీస్తున్నానని,అది హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది అన్నారు. ఇక మూడు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అలాగే ప్యాచ్ వర్క్ మిగిలింది అన్నారు. ఆయన తాజా చిత్రం ఈగ గురించే అని వేరే అని చెప్పక్కర్లేదు. సమంత,నాని,కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.