Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
చిరంజీవి అండగా ఉన్నారు, మరిచిపోలేను: మహేష్
హైదరాబాద్: ‘చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ స్టార్స్ చిరంజీవితో హిందీలో జెంటిల్మెన్, నాగార్జునలతో జఖ్మ్ సినిమా చేసాను. చిరంజీవి మేలు ఎప్పటికీ మరిచిపోలేను. జెంటిల్మెన్ సినిమా తీసినప్పుడు నా దగ్గర డబ్బులేమి లేవు. అయినా చిరంజీవిగారు అంగీకరించారు. ఈరోజు కోట్లాది వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఉండొచ్చు. కానీ చిరుతో సినిమాని రీమేక్ చేసినప్పుడు మహేష్ భట్ పూర్తిగా అప్పుల్లో ఉన్నాడు. ఆ విషయంలో చిరంజీవి చేసిన సహకారానికి ఆయన పట్ల ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటానను అని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ తెలిపారు.
థియేటర్ ఆర్ట్స్ కు సంబంధించిన విషయమై మహేష్ భట్ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... థియేటర్ ఆర్ట్స్ను సినిమాను వేరుచేసి చూడలేం. ప్రస్తుతం సినిమాలో విజయం సాధించి ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులంతా ఒకప్పుడు స్టేజీ డ్రామాల్లో పాల్గొన్నవారే అన్నారు.
షబానా అజ్మి, నందితాదాస్, రాధిక ఆప్టే, కిరణ్ఖేర్, ప్రకాష్రాజ్, మనోజ్భాజ్పాయ్, ఓంపూరి, అనుపమ్ ఖేర్, నసిరుద్దీన్షా, షఫీ ఇలా ఎందరో ఆర్టిస్టులు. అదే తెలుగుకు వచ్చే సరికి ఎన్టీఆర్, నాగేశ్వరరావు, చిరంజీవి వంటి పాతతరం నటీనటులంతా వెండితెరపై ఓ వెలుగు వెలిగినవారేనని అన్నారు.