Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బినామీని కాదు, నన్నొదిలేయమంటున్న బండ్ల గణేష్
హైదరాబాద్: రాజకీయాల కోసం తనను బలి చేయడం మానుకోవాలని గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ బుధవారం అన్నారు. బండ్ల గణేష్ ఇంటి పైన, కార్యాలయాల పైన దాడి చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఆయనను విచారించిన విషయం తెలిసిందే. దీనిపై బండ్ల గణేష్ సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్లో స్పందించారు. రాజకీయాల కోసం తనను బలి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాను ఎవరికీ బినామీని కాదని ఆయన చెప్పారు. తాను కష్టపడి పైకి వచ్చానని, ఎవరికో బినామీని అని చెప్పడం సరికాదన్నారు. తనకు కుటుంబ వ్యాపారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తనపై బురద జల్లడం ఇక నుండి అయినా మానుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాల కోసం తనను పావుగా ఉపయోగించుకుంటున్నారని, ఇది సరికాదని నిర్మాత బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు.
కాగా బండ్ల గణేష్ నివాసంపై, కార్యాలయంపై రెండు రోజలు దాదాపు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించడం, ఆయనను తమ కార్యాలయానికి తీసుకుని వెళ్లి రెండున్నర గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు 12 మంది ఐటి అధికారులు నిర్వహించిన సోదాల్లో బండ్ల గణేష్ నివాసంలో, కార్యాలయంలో కీలకమైన పత్రాలు లభించినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
సినిమాల్లో హాస్య పాత్రలు వేస్తూ వచ్చిన బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారిపోయాడు. నిర్మాతగా ఆయన రవితేజ హీరోగా 16కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇదే ఆయన తొలి సినిమా. తాము హత్య చేసినా బొత్స సత్యనారాయణ తనకు అండగా నిలబడుతారని గతంలో ఏ సినిమా కార్యక్రమంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం బండ్ల గణేష్ భారీ సినిమాలు వరుసగా నిర్మిస్తుండడమే ఐటి అధికారుల కన్ను పడడానికి కారణమని అంటున్నారు.