పథకం ప్రకారమే నాపై దాడులు : దాసరి

By Srikanya

Dasari Narayan Rao
హైదరాబాద్‌ : బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతో తనకెలాంటి సంబంధం లేదని ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు, కేంద్ర బొగ్గు గనులశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. తాను 'బొగ్గులపులి' కాదని, బొబ్బిలిపులినేనని బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనపై పథకం ప్రకారం దాడులు జరిగాయంటూ నిజానిజాలను త్వరలో బయటపెడతానన్నారు. విచారణలో అన్నీ తెలుస్తాయన్న ఆయన, తన అభిమానులను ఆందోళన చెందవద్దన్నారు.

బొగ్గు కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందంటూ దాసరి నారాయణరావు, కాంగ్రెస్‌ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. దాసరి నారాయణరావుకు సంబంధాలున్న సౌభాగ్య మీడియా సంస్థతోపాటు జిందాల్‌కు చెందిన మరో నాలుగు ప్రైవేటు సంస్థలపైనా సెక్షన్‌ 120-బి రెడ్‌విత్‌ ఐపీసీ సెక్షన్‌ 420, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(1)(డి) కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

సోమవారం కేసులు నమోదు చేసిన సీబీఐ మంగళవారం ఉదయం నుంచీ ఢిల్లీలోని 17చోట్ల, హైదరాబాద్‌లోని 2చోట్ల సోదాలు జరిపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న దాసరి నారాయణరావు నివాసంతోపాటు, సౌభాగ్య మీడియా సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గాందగల్‌ బొగ్గు గని కేటాయింపులో జరిగిన అవకతవకలపైనే కేసులు నమోదు చేసి సోదాలు జరిపినట్లు సీబీఐ పేర్కొంది.

బొగ్గు గనులను దక్కించుకోవడానికి ఢిల్లీలోని రెండు ఉక్కు పరిశ్రమలు వాస్తవాలను వక్రీకరించినట్లు వెల్లడించింది. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు దాసరి నారాయణరావు నేతృత్వంలో నడిచే సౌభాగ్య మీడియాలో రూ.2.25 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. ఈ వ్యవహారంలో ఇంకా దర్యాప్తు సాగుతున్నట్లు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X