twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్ళికి ముందు ప్రాస్టిట్యూట్ గా మనీషా కొయరాలా..

    By Srikanya
    |

    త్వరలో నేపాల్ కి చెందిన వాణిజ్య వేత్త సామ్రాట్ దహాల్ ను వివాహం చేసుకోనున్న మనీషా కోయిరాల ప్రస్తుతం ఓ చిత్రం చేస్తోంది. ఏక్ సెకెండ్ జో జిందగీ బదల్ దే టైటిల్ తో నిర్మితమయ్యే చిత్రంలో మనీషా స్ట్రీట్ ప్రాస్టిట్యూట్ గా కనిపించనుంది. పార్ధో ఘోష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్ నాలుగున రిలీజ్ కానుంది. ఇక మనీషా వివాహం జూన్ 19వ తేదీన జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే పెళ్ళికి ఓ పదిరోజులు ముందు ఈమె వేశ్యగా నటించిన చిత్రం రిలీజ్ కానుంది. దాంతో కొంతమంది ఆ చిత్రం రిలీజ్ ను వాయిదా వేసుకోమని చెప్తున్నారుట. అయితే మనీషాకు ఆ చిత్రం విజయంపై అపారమైన నమ్మకం ఉంది. అయినా దీనికి పెళ్ళికి లింక్ పెడతారేంటి..అది పాత్రేగా అని విసుక్కుంటోంది. అలాగే మళయాళంలో నిర్మితమవుతున్న ఎలక్ట్రా అనే చిత్రంలో నయనతార కు ఆమె తల్లిగా చేయనుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X