Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తప్పుడు వార్తే... ‘బహుబలి’ తర్వాతి సినిమాపై రాజమౌళి
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బహుబలి' తర్వాత డైరెక్ట్ తమిళ సినిమా చేయబోతున్నారని, తమిళ హీరో ప్రశాంత్తో ఈచిత్రం ఉంటుందనే కోలీవుడ్లో వార్తలు రావడంపై రాజమౌళి స్పందించారు. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా విస్మయం వ్యక్తం చేసారు.
బహుబలి
సినిమా
విషయానికొస్తే...
మగధీర
తర్వాత
ఆ
రేంజిలో
భారీ
బడ్జెట్తో
రాజమౌళి
ప్లాన్
చేసిన
సినిమా
ఇది.
ప్రభాస్
హీరోగా
రూపొందుతున్న
ఈచిత్రంలో
రాణా
విలన్
పాత్రలో
కనిపించనున్నాడు.
ఈచిత్రంలో
వీరిద్దరి
మధ్య
కత్తియుద్ధం
సన్ని
వేశాలు
ఉండనున్నాయి.
ఈ
మేరకు
వీరిద్దరికి
కత్తియుద్దంలో
ట్రైనింగ్
ఇస్తున్నారు.
ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు.