twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పుడు వార్తే... ‘బహుబలి’ తర్వాతి సినిమాపై రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బహుబలి' తర్వాత డైరెక్ట్ తమిళ సినిమా చేయబోతున్నారని, తమిళ హీరో ప్రశాంత్‌తో ఈచిత్రం ఉంటుందనే కోలీవుడ్లో వార్తలు రావడంపై రాజమౌళి స్పందించారు. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా విస్మయం వ్యక్తం చేసారు.

    బహుబలి సినిమా విషయానికొస్తే...
    మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు.

    ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

    ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

    English summary
    There is a strong buzz in Kollywood that ace director SS Rajamouli will soon wield the megaphone for a direct Tamil film. SS Rajamouli, after wrapping up Bahubali, will be donning the director’s robes for a Tamil film that may star Prashanth in the lead role. Rajamouli denied this news. "News that I am working with Prashanth after baahubali is false. Wonder where the rumors start from…" he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X