త్రాగాలో వద్దో నిర్ణయించుకునో హక్కు ఉంది: శ్రియ
త్రాగుడుని నేను సమర్ధించను కానీ...కానీ పద్దెనిమిదేళ్ళు వచ్చిన ప్రతీ ఒక్కరికీ తాను త్రాగాలో వద్దో అనే డిసైడ్ చేసుకునో మెచ్యూరిటీ ఉంటుంది. నేను ఇండియాలో ఉండే యంగ్ పీపుల్ ఎంత మెచ్యూరిటీగా ఆలోచించగలరో..వాళ్ళ సొంత డెషిషన్స్ తీసుకోగలరో చెప్తున్నాను అంది హీరోయిన్ శ్రియ. రీసెంట్ గా మహారాష్ట్ర్ర గవర్నమెంట్ లీగల్ గా త్రాగుడు వయస్సును పాతికేళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానిపై ఆమె బ్లాగ్ లో స్పందిస్తూ..పెళ్ళిళ్ళు పద్దెనిమిదేళ్ళకే చేసుకోవచ్చు. ఓటు హక్కు పద్దినిమేదేళ్ళకే వస్తుంది. కానీ త్రాగే వయస్సు మాత్రం రాదా అంది. దానిపై మీడియా ఆమె త్రాగుడు వ్య వహారాలన్నిగుర్తు చేస్తూ కామెంట్స్ చేసింది.దానికి స్పందనగా ఆమె పై మాటలు అంది. ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికీ లేని ఆసక్తి శ్రియ భుజాలు తడుముకున్నట్లు ఆమెకు ఎందుకు అంటున్నారు.


Click it and Unblock the Notifications











