అది తప్ప....చాలా కాపీ కొట్టా: రాజమౌళి వివరణ
హైదరాబాద్: గతంలో నేను చాలా సినిమాలు, నవలల నుండి సీన్లు కానీ చేసారు. కానీ 'విక్రమార్కుడు' సినిమాలోని బుల్లెట్స్ సీన్ మాత్రం కాపీ చేయలేదు. చాలా కాలం క్రితమే ఆ సీన్ మా నాన్న రాసారు. కానీ ఆ సీన్ నేను శాంభవి ఐపీఎస్ చిత్రం నుండి కాపీ చేసాననే వాదన మాత్రం నికాదు అని ట్విట్టర్లో వెల్లడించారు. అయినా ఈ విషయం గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నన్ను నమ్మే వారి కోసమే ఈ వివరణ ఇస్తున్నాను అని రాజమౌళి స్పష్టం చేసారు.
రాజమౌళి ప్రస్తుతం బాహుబలి చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంతగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇండియాతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి తెలుగు సినిమా చరిత్రలో రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టే తొలి సినిమా ఇదే అని అంటున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం తాజాగా షెడ్యూల్ మహాబేలేశ్వర్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ మళ్లీ రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు. 2015లో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











