Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
జైబోలో తెలంగాణ: వార్నింగ్ గుర్తు చేసుకున్న జగపతి, ఇక ఇబ్బంది ఉండదని కేటీఆర్ భరోసా!
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో ఉద్యమానికి మరింత ఊపు తేవడంలో భాగంగా తెరకెక్కించిన చిత్రం 'జై బోలో తెలంగాణ'. తాజాగా ప్రత్యేక రాష్ట్ర కల నిజమైన నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సభ్యుల సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోగా నటించిన జగపతి బాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. 'జై బోలో తెలంగాణ' చిత్రం చేయడానికి తాను ఒప్పుకున్న సమయంలో తనకు ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి కూడా బెదిరింపులు వచ్చాయని, కొందరు నన్ను చంపుతామని హెచ్చరించారని జగపతి బాబు తెలిపారు.
'కానీ నేను ఒక కళాకారుడిని. నాకు ప్రాంతం, బాష, కులం, మంతం అనే తేడా లేదు. అందుకే ఈ సినిమా చేసారు. ఇపుడు మనం, ఇకమీదట కూడా మనంగానే ఉండాలి, ఉంటాలమని ఆశిస్తున్నాను. ఇండియా పటంలో గీతలు ఏర్పడ వచ్చుకానీ, మనందరం భారతీయులమే. అందరం కలిసుండాలనేదే నా కోరిక' జగపతి బాబు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.టి. రామారావు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమం చాలా కాలం నుండి ఉన్నప్పటికీ 2009లో భావోద్వేగం ఎక్కువైంది. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ ఇబ్బంది పడిందని అన్నారు. జరిగిందంతా రాష్ట్ర సాధన కోసమే. ఇక భవిష్యత్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థిరపడ్డ తెలుగు సినిమా పరిశ్రమ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతాం. ఇండస్ట్రీని మరింత విస్తరింప జేసుకుందామని తెలిపారు.
నిర్మాత కెఎస్ రామారావు మాట్లాడుతూ అనేక ఏళ్లుగా, అనేక ప్రభుత్వాలు ఇక్కడి సినిమా రంగాన్ని అభివృద్ధి చేసాయి. కానీ ఇక్కడ ప్రాంతీయ భేదాల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరిచ్చిన భరోసా దైర్యాన్ని ఇచ్చింది అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ...తెలంగాణ వ్యక్తిగా నేను చెప్పేది ఒక్కటే. పరిశ్రమకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అన్నారు.
'జైబోలో తెలంగాణ' చిత్రం సక్సెస్ మీట్లో ఇంకా దర్శకుడు ఎన్.శంకర్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెరాస నాయకుడు కేటీఆర్, నిర్మాత దిల్ రాజు, గాయకుడు గద్దర్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు పాల్గొన్నారు.