Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్, చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్టుల్లో లేనంటూ...సమంత క్లారిటీ
అయితే ఈ వార్తల్లో నిజం లేదని తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది సమంత. 'ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు కమిట్ అయి ఎక్కవగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇంకా ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. అసలు ఈ సంవత్సరం ఏ సినిమాకు కూడా సైన్ చేయాలనే ఆలోచన లేదు' అని ట్వీట్ చేసింది.
'ప్రస్తుతం తాను రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది సినిమాల్లో నటిస్తున్నాను. అక్కినేని ఫ్యామిలీతో రూపొందబోతున్న 'మనం' సినిమా వచ్చే నెల ప్రారంభం కాబోతోంది. అదే విధంగా జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలోనూ చేయబోతున్నాను. ఆగస్టు నెలలో సూర్య-లింగుస్వామి సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత వివి వినాయక్ సినిమా చేయబోతున్నాను' అని వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఇక ఏ కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ...అభిమానులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది ఈ సెక్సీ లేడీ. ప్రస్తుతానికి సమంత కొత్త సినిమాలు ఒప్పుకోకపోయినా ఆమె నటించిన సినిమాలు త్వరలో వరుస పెట్టి విడుదల కాబోతున్నాయన్నమాట.