Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘రామయ్యా వస్తావయ్యా’...ఇదీ లాభనష్టాల లెక్క!
అయితే ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత చెబుతున్న వివరాలను పరిశీలిస్తే సినిమా పెట్టబడి రికవరీ చేస్తుందనే నమ్మకం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారట. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు దిల్ రాజు సంతోషంగానే ఉన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'సినిమాకు స్పందన బాగుంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 20 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజుల్లో సినిమా పెట్టుబడి తిరిగి వస్తుంది. ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా ఎంతో సంతోషంగా ఉన్నాను' అని దిల్ రాజు మీడియాకు వెల్లడించారు.
ఈ చిత్రంలో ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత,శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు.