Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఐటం సాంగ్ విషయమై మంచు లక్ష్మి వివరణ
హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రసన్న ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కడలి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆమె ఈ చిత్రంలో ఓ హాట్ ఐటం నెంబర్ చేయబోతోందంటూ వార్తలు వచ్చాయి. మీడియాలో ఈ వార్తకు విషేష ప్రాచుర్యం లభించింది. ఈ నేఫధ్యంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ...అవన్నీ కేవలం రూమర్స్ అని,తాను ఏ ఐటం నెంబర్ చేయటం లేదని తెలియచేసింది. ఈ చిత్రంలో ఆమె ఓ గ్రామీణ యువతిగా,నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తోందని తెలిసింది.
'విలన్' చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాల చిత్రం 'కడలి'. ఇందులో కార్తి కుమారుడు గౌతం, రాధ రెండో కుమార్తె తులసి జంటగా నటిస్తున్నారు. అరవింద్స్వామి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. జాలర్ల జీవిత నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.కడల్' చిత్ర కథ ప్రకారం క్లైమాక్స్ లో తుపాను సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియను కొన్ని రోజుల క్రితం ప్రారంభించారు. ఇంతలో వచ్చిన 'నీలం' తుపానును తన సినిమాకు వినియోగించుకున్నారు మణిరత్నం. సముద్రతీరంలో సుమారు గంటపాటు కీలకఘట్టాలను చిత్రీకరించినట్లు సమాచారం.
సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది.
మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.