Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హాట్ న్యూస్ : పవన్ కళ్యాణ్కు నో చెప్పిన అనసూయ
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో హాట్ అండ్ సెక్సీ యాంకర్ అనసూయను తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారైందని, ఆమెతో ఈ చిత్రంలో ఐటం సాంగు చేయిస్తున్నారని మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో అనసూయ ఓ ప్రతికతో మాట్లాడుతూ...ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. 'పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటం సాంగు చేయమని నన్ను అప్రోచ్ అయిన మాట నిజమే. కానీ ఆ సాంగులో నటించడానికి నేను తగను అని నా భావన. నా సినిమా కెరీర్ ఐటం సాంగుతో ప్రారంభం అవడం కూడా ఇష్టం లేదు. ముందుగా నా యాక్టింగ్ స్కిల్స్ను మెరుగు పరుచుకున్న తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడతాను అని వెల్లడించింది.
'ప్రస్తుతం తాను టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాను. దర్శకుడు గుణశేఖర్ కూడా 'రుద్రమదేవి' చిత్రంలో కీలకమైన పాత్ర చేయమని అడిగారు. కానీ 10 కేజీల వెయిట్ తగ్గమని చెప్పారు. దీనికి కూడా నేను ఒప్పుకోలేదు. ఈ అవకాశాలు మిస్సయినందుకు తనకు ఎలాంటి విచారం లేదు' అని అంటోంది అనసూయ.
న్యూస్ రీడర్గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయకు పెళ్లయి, ఓ బాబు కూడా ఉన్నాడు. చూడ చక్కని రూపం, చలాకీతనం ఉండటంతో న్యూస్ రీడర్ నుంచి యాంకర్గా మారి....తన సెక్సీ యాటిట్యూడ్తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో చాన్స్ వచ్చినా వదులు కోవడం....సరైన నిర్ణయం కాదని సినీ పండిట్స్ అభిప్రాయం.