Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు, ఓ రాజకీయ నాయకుడిని పెళ్లాడినట్లు కోలీవుడ్లో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై అంజలి స్పందించింది. తనకు ఎవరితోనూ పెళ్లి కాలేదని వివరణ ఇచ్చింది. ఈ వార్తలు తనను ఎంతో షాక్కు గురి చేసాయని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సినిమాల షూటింగులో బిజీగా ఉన్నానని అంజలి వెల్లడించారు. 'మద గజ రాజా' సినిమా డబ్బింగుకు తాను సహకరించడం లేదనే వార్తల్లో కూడా నిజం లేదని అంజలి స్పష్టం చేసారు. విశాల్ హీరోగా రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో 'మద గజ రాజా' పేరుతో సెప్టెంబర్ 6న విడుదలవుతోంది.
ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్, వరలక్ష్మీ, సంతానం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరో వైపు అంజలి తెలుగులో వెంకటేష్-రామ మల్టీ స్టారర్ 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టు సైన్ చేయలేదు.
మరో వైపు అంజలి ప్రస్తుతం నటించిన 'మసాలా' చిత్రంతో పాటు, 'మద గజ రాజా' ఇంకా పోస్టు ప్రొడక్షన్ దశలోనే ఉంది. అంజలి అదృశ్యం అయినట్లు వార్తలు రావడంతో ఆందోళనలో పడ్డ చిత్ర నిర్మాతలు...తాను ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.