Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
చిరంజీవి సినిమాలు మిస్సవుతున్నా: విష్ణు
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాదు, అటు యూత్ మెచ్చే హీరోయిజం, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే అంశాలు, మంచి సందేశాత్మకంగా వినోదాత్మకంగా ఉండటమే అందుకు కారణం.
ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టి సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన అభిమానుల్లో చాలా మంది మెగాస్టార్ సినిమాలు మిస్సవుతున్నామనే భావనకు లోనవుతున్నారు. నేటికీ చిరంజీవి సినిమాల్లోకి తిరిగి రావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఆయన వీరాభిమానులు ఇలా ఫీలవ్వడం సహజమే. కానీ మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు కూడా ఇలానే ఫీలవుతుండటం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
మంచు విష్ణు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 'చిరంజీవి అంకుల్ ను ఎయిర్ పోర్టులో కలిసాను. ఆయనతో ముచ్చటించడం ఏంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయన సినిమాలకు దూరం అవ్వడంతో...నా లాంటి మూవీ లవర్స్ ఆయన సినిమాలు మిస్సవుతున్నట్లు ఫీలవుతున్నాం' అంటూ ట్వీట్ చేసారు.
ఇక
మంచు
విష్ణు
సినిమాల
విషయానికొస్తే...
ఇటీవల
విష్ణు
నటించిన
'దేనికైనా
రెడీ'
చిత్రం
బాక్సాఫీసు
వద్ద
మంచి
విజయం
సాధించింది.
అయితే
సినిమాపై
బోలెడు
వివాదాలు
కూడా
నెలకొన్నాయి.
ఈచిత్రం
తమ
సామాజిక
వర్గాన్ని
కించ
పరిచే
విధంగా
ఉందని
బ్రాహ్మణులు
రాష్ట్ర
వ్యాప్తంగా
ఆందోళన
కార్యక్రమాలు
చేపట్టిన
విషయం
తెలిసిందే.
ప్రస్తుతం
ఇరు
వర్గాలు
ఒకరిపై
ఒకరు
కేసులు
వేసుకున్నారు.