Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సూర్య ఫ్యాన్స్ ఎఫెక్ట్: మాట మార్చిన కరీనా!
హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య గురించి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. సూర్య ఎవరో నాకు తెలియదు అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన ఆమె....సూర్య అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ కరీనా కపూర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.
'సూర్యను ఇప్పటి వరకు కలవలేదు అనేది నిజం. దాని అర్థం ఆయనంటే ఎవరో తెలియదని కాదు. ఆయన గురించి బాగా తెలుసు. తమిళ సినిమా పరిశ్రమలో పెద్ద స్టార్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనంటే గౌరవం. ఆయన నటించిన తమిళ చిత్రం సింగం చిత్రానికి రీమేక్గా వస్తున్న హిందీ చిత్రంలో కూడా నేను నటిస్తున్నాను' అని కరీనా కపూర్ తెలిపారు.
సూర్య నటిస్తున్న తమిళం చిత్రం 'అంజాన్'లో నేను ఐటం సాంగు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు విని అప్ సెట్ అయ్యాను. నేను అసలు ఆ చిత్ర దర్శకుడు లింగు స్వామిని ఇప్పటి వరకు కలవనేలేదు. సాంగు చేస్తున్నట్లు ఎలాంటి అంగీకారం కూడా తెలపలేదు. అలాంటపుడు నేను ఆయన చిత్రంలో ఐటం సాంగులో నటిస్తున్నట్లు ఆయన ఎలా చెబుతారు? అని కరీనా మండి పడ్డారు.
సూర్య హిందీలో సినిమా చేస్తే నేను తప్పకుండా చేస్తాను. సూర్య లాంటి పెద్ద హీరోతో చేయడం అంటే ఇష్టమే. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి వారితో చేయాలని ప్రతి నటి కోరుకుంటుందని కరీనా కపూర్ తెలిపారు. మొత్తానికి కరీనా వివరణ ఇవ్వడంతో సూర్య అభిమానులు కూల్ అయ్యారు.