Don't Miss!
- News rasi phalalu today: ఈ రాశులవారికి శుభం; ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు!!
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
అన్ని రకాలుగా మోసపోయానంటున్న హాట్ ఐటం గర్ల్
సినిమావాళ్ళు మోసగాళ్ళు...నేను అన్ని రకాలుగా మోసపోయాను. ఇక నుంచి నేను వెండి తెరపై కనపడను. నాకు బాలీవుడ్ అంటే విరక్తి కలిగింది అనే స్టేట్ మెంట్స్ ఇస్తోంది ఐటం గర్ల్ రాఖీ సావంత్. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇలా కోపాన్ని వెళ్ళగక్కింది. అలాగే ఇకనుంచీ కేవలం టీవీ మీడియాకే పనిచేస్తా..అక్కడ కంపర్టుగా ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా తనను యష్ రాజ్ ఫిల్మ్ వారు మోసం చేసారని, వారి దిల్ బోలే హడియప్పా చిత్రం కోసం ఆరు నెలలు డేట్స్ తీసుకున్నారని, తెరపై చూస్తే చాలా చిన్న పాత్ర అని వాపోయింది. మొత్తం ఎడిటింగ్ చేసారని, అయినా ఆ సినిమా రాణి ముఖర్జీ కోసం తీసారని, మిగతా వారిపై దృష్టి అస్సలు లేదని అంది. అందుకే పెద్ద తెరకో నమస్కారం. అయినా అన్నాళ్ళుగా రాని గుర్తింపు నాకు ఒక్కసారిగా టీవీ మీడియా ద్వారా వచ్చింది. రాఖీ కా స్వయంవర్ హిట్టవటం నాకు కలిసివచ్చింది. నేనే ఇక్కడ మహారాణిని...ఎందుకు పెద్ద తెరను పలకరించి దెబ్బ తినాలి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రాఖీ కా ఇన్సాఫ్ అనే కొత్త రియాలటీ షోను ఇమేజన్ టీవీ కోసం చేస్తోంది. ఇక ఐటం సాంగ్స్ గురించి చెబుతూ నేను అవి చేయటానికి సిగ్గు పడను..ఎందుకంటే భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు అని ముగించింది.