Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పింది
ముంబై: ఇంద్రాణి ముఖర్జియా ఒకప్పుడు తనకు పెద్ద అభిమాని అని ప్రముఖ నటి, ఐటం డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కూతురు షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ప్రధాన నిందితురాలు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
షీనా హత్య కేసు ఆధారంగా ఏక్ కహానీ జూలీ కీ అనే సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధాన పాత్రలో రాఖీ సావంత్ నటించనుంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. తనకి షీనా బోరా, ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా బాగా పరిచయస్తులన్నారు.
పీటర్ ముఖర్జియా నిర్మాణంలో వచ్చిన రియాల్టీ షోలు జరుగుతున్నప్పుడు షూటింగ్ సమయంలో సెట్లో కలిసినట్లు చెప్పింది. కాగా, రాఖీ సావంత్ తాజా ఈ చిత్రం షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఉంటున్నట్లు చెబుతుండటం గమనార్హం.
ఇంద్రాణి గురించి ప్రతి ఒక్క విషయం తెలుసని, అందుకే ఈ సినిమాలో తనకంటే బాగా ఎవరూ నటించలేరని చెప్పింది. ఈ సినిమాకి అవధ్ శర్మ నిర్మాత. ఇందులో ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ నటిస్తోంది. రాఖీ మాట్లాడుతూ.. ఇంద్రాణి ఎప్పుడు ఒత్తిడితో జీవించలేదన్నారు.