Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ద్యా...వుడా...! చీ..! నిజంగా కంగనా రనౌత్ మురికిపిల్ల
కంగన రనౌత్ "చదువు, తిండి, సరదాలు ఇలా అన్నిట్లోనూ మా అన్నకిచ్చినంత ప్రాధాన్యత నాకిచ్చేవారు కాదు. అది అంగీకరించలేక 16 ఏళ్ల వయసులో ఇళ్లు వదిలి ముంబయి వచ్చేశాను. అప్పుడే తొలిసారి నాపై బ్యాడ్గాళ్ ముద్ర పడింది. అది మొదలు ఇప్పటిదాకా ఎన్నో సార్లు ఎంతో మంది నన్ను బ్యాడ్గాళ్ అన్నారు. పరిశ్రమలో ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలు, ఓటములు, విజయాలు రుచిచూశాను." అంటూ చెప్పుకునే కంగన రనౌత్. బాలీవుడ్ లో పైకి వచ్చేందుకు చాలానే కష్టపడింది. ఈ అమ్మాయి తెలుగులోనూ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ లో చేసింది.
తను వెడ్స్ మను' నుంచి కంగనా రనౌత్ సీన్ మారిపోయింది. ఆ సినిమాతో తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్న కంగనా 'రజ్జో'తో నటిగా మరో మెట్టు పైకెక్కింది. ఇక, ఇటీవల విడుదలైన 'క్వీన్'తో కంగనా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కంగనా అద్భుతమైన నటి అని అమితాబ్ బచ్చన్ సైతం ప్రశంసించేశారు.ఇక హృతిక్ రోషన్ తో వివాదం సమయం లోనూ కంగన ధైర్యంగానే నిలబడింది.ఇప్పుడంతా ప్రశాంతం అయితే మొన్న స్వచ్చ భారత్ కార్యక్రమం లో కంగన తన "స్నానం" గురించి చేసిన కామెంట్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది... ఇంతకీ తన స్నానం గురించి ఏం చెప్పిందో స్లైడ్ షోలో చూద్దాం...
షాకింగ్ నిజాలు
ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ షార్ట్ ఫిలిం ప్రారంభ కార్యక్రమంలో తన గురించి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పి అందరిని అబ్బురపరిచింది. పసిడి మేనిఛాయతో మెరిసిపోయే కంగనా రనౌత్కి అప్పట్లో స్నానం చేయాలంటే మహా చిరాకట.
బద్దకం
రోజూ స్నానం చేయాలంటే చాలా బద్దకంగా ఫీలయ్యేదట. సోమరితనంతో తను చాలా బద్ధకంగా జీవితాన్ని గడిపేదట.
ఒంటరిగా
ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకునేది కాదట. ఆ సమయంలో మంచి స్నేహితులు ఉండేవారు కాదని, తనకిష్టమైన అవకాశాలు రాలేదని తెలిపింది.
వేదాంతం
అయితే, ఇలాంటి పరిస్థితుల్లోంచే చాలా విషయాలు నేర్చుకున్నానని, వేదాంతం చదివానని, స్వామి వివేకానంద మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టాక పరిశుభ్రత అవసరం తెలిసొచ్చిందని తన మనసులోని మాటను బయటపెట్టింది.
ఆధ్యాత్మికం
అప్పుడే తాను ఆధ్యాత్మికంగా, మానసికంగా దృఢంగా తయారయ్యాననీ, ఆరోగ్యమ్మీదా, శుభ్రత మీదా శ్రద్ద పెంచుకున్నానీ చెప్పింది.
సోషల్ మీడియాలో
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓహో ఆధ్యాత్మికత దారిలో పడ్డాకే "మినరల్ వాటర్ స్నానం" మొదలెట్టావా కంగనా...
జోకులే
తపస్సులో మీకు త్వరగా మోక్షం రావాలీ అంటే మినరల్ వాటర్ స్నానం చేయండి,
జోకులే
దేవుడికి గంగా నీటికంటే మినరల్ వాటర్ ఇష్టం అనుకుంటా.... అంటూ రకరకాలుగా ఆడుకుంటున్నారు.
జోకులే
ముంబై సెలబ్రిటీస్ ఎక్కువగా ఆసక్తి చూపించే ఖార్ ప్రాంతంలో ఇల్లు తీసుకున్నప్పుడు స్నానానికి కూడా మినరల్ వాటర్ వాడుతున్నా" అంటూ కంగన చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇలా సరదాగా జోకులు పేలుస్తున్నారు...
అభిమానులు
తెరపై బోల్డ్ గా నటించడమే కాదు తెరవెనుక విషయాలనూ అంతే బోల్డ్ గా చేప్పేస్తుందని ఇప్పటికే కంగనాకు పేరుంది. అది మరోసారి ఇప్పుడు రుజువైందని ఆమె అభిమానులు అంటున్నారు.