Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ తో ‘పులి’ నే కాదు మరో సినిమా కూడా చేస్తా...!
పవన్ కళ్యాణ్ హీరోగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు ఎస్.జె. సూర్య ఈసారి తానే నిర్మాతగా మారి మరీ, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ఎస్ జె సూర్య ప్రకటించాడు. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో తాను కలిసి పనిచేసిన వ్యక్తులందరిలోకీ పవన్ వ్యక్తిత్వం ప్రత్యేకమైనదన్న ఎస్ జె సూర్య, తనకీ పవన్ కీ మంచి ర్యాపో కుదిరిందని చెప్పుకొచ్చాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.
పులి సినిమాని ప్లాప్ అంటూ ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, వసూళ్ళ పరంగా సినిమా సత్తా ఏంటో టాలీవుడ్ బాక్సీఫీస్ కి 'పులి" రుచి చూసిస్తోందని ఎస్ జె సూర్య అభిప్రాయపడ్డాడు. మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం తప్ప, కమర్షియల్ హంగుల్లో చూపించాలనుకోలేదనీ, ఎంటర్ టైన్ మెంట్ కొంతమేర మిస్సవడం వెనుక హీరో పాత్ర తీరుతెన్నులే ప్రధాన కారణమని ఎస్ జె సూర్య వ్యాఖ్యానించాడు.
ఇదిలా వుంటే, 'పులి" పేరిట 35కోట్ల రూపాయల సొమ్మును ఖర్చు చేసి, చెత్త ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి వదిలాడంటూ, ఎస్ జె సూర్య పై టాలీవుడ్ లో ఆరోపణలు విన్పిస్తోన్న సంగతి విదితమే.