Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్-నానిలతో...గౌతం మీనన్ మల్టీస్టారర్ మూవీ!
హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ మూవీ జోరు ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెంకటేష్-మహేష్ బాబు కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతుండగా, హిందీ చిత్రం 'బోల్ బచ్చన్' రీమేక్ గా విక్టరీ వెంకటేష్-ఎనర్జిటిక్ స్టర్ రామ్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజాగా 'ఎటో వెళ్లి పోయింది మనసు' దర్శకుడు గౌతం మీనన్ కూడా మల్టీ స్టారర్ చిత్రం చేయాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఓ ఇంట్వ్యూలో గౌతం మీనన్ మాట్లాడుతూ తన మనసులోని మాటను బయట పెట్టారు. ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలో జోరందుకున్నాయి. మీరు మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎవరితో చేస్తారు? అనే ప్రశ్నకు గౌతం మీనన్ స్పందిస్తూ....'అల్లు అర్జున్-నానిలతో త్రిబాషా చిత్రంగా లవ్ అండ్ యాక్షన్ స్టోరీతో సినిమా సినిమా చేస్తా' అంటూ సమాధానం ఇచ్చారు.
గౌతం మీనన్ ఆలోచన చూస్తుంటే....వారి స్టార్ ఇమేజ్ను బేస్ చేసుకుని ఆయన ఇలా వ్యాఖ్యానించినట్లు స్పష్టం అవుతోంది. అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కేరళల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. నాని కూడా తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు పరిచయమే. తనకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి పేరు ఉండటంతో వీరితో సినిమా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన భావన కాబోలు.
ఇతర విషయాల్లోకి వెళితే....గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలే సాధిస్తోంది. సినిమా స్లోగా ఉందనే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రిజల్ట్ బాగానే ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నాడు.