Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాక్ ఐఎస్ఐ చీఫ్తో బాలీవుడ్ స్టార్కు సంబంధం, దేశమే గొప్ప అంటూ..!
హైదరాబాద్: సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన కబీర్ ఖాన్ సినిమా ‘ఫాంటమ్'. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దాడులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ను మట్టుపెట్టే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో సైఫ్ నటించాడు. ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది.
ఈ సినిమాపై ఇప్పటికే పాకిస్థాన్ లో నిషేదం విధించారు. తాజాగా సినిమా ప్రమోషన్లో సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించాయి. పాకిస్తాన్ లో ఈ సినిమాపై నిషేదం విధించిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ... జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ ముంబై టెర్రరిస్టు దాడుల వెనక అసలు సూత్రధారి అని పేర్కొనడం గమనార్హం. సైఫ్ వ్యాఖ్యలతో ఇంటర్నేషనల్ మీడియాకు షాకైంది.
అంతే కాకుండా....2012 లో ఐఎస్ఐ చీఫ్ గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తనకు అంకుల్ అవుతారని, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి ఆడుకున్నట్లు తెలిపారు. దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని, భారత దేశానికి హాని చేసేవారు తన కుటుంబసభ్యులైన వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధు వర్గం వాడే అన్న సైఫ్, భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు.
ఉన్నట్టుండి సైఫ్ ఈ విషయాలు మాట్లాడటం వెనక పబ్లిసిటీ గిమిక్స్ ఉన్నాయని, తాను నటించిన ‘ఫాంటమ్' సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకే ఆయన ఈ విషయాలు ఇపుడు వెలుగులోకి తెచ్చారని అంటున్నారు. మరి ఈ వివాదాలు సైఫ్ సినిమాకు ఏ మేరకు సహకరిస్తాయో చూడాలి.