Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Allu Arjun: గోల్డెన్ టెంపుల్ లో ఫ్యామిలీతో అల్లు అర్జున్.. భార్య కోసం ప్రత్యేకంగా..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో కూడా ప్రత్యేకంగా టైం కేటాయిస్తాడు అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నేడు తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించడం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. బన్నీతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రార్థనా చేసి మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఫ్యామిలీతో బన్నీ
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ స్టార్ హోదా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే పుష్ప సినిమా కోసం చాలా ఎక్కువకాలం కష్టపడిన బన్నీ ఆ తర్వాత వీలైనంత ఎక్కువ సమయాన్ని తన ఫ్యామిలీకి కేటాయిస్తున్నాడు. ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఈవెంట్లో కూడా పాల్గొంటున్న బన్నీ అప్పుడప్పుడు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు.
ఫ్యామిలీ హీరోగా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలలో మంచి ఫ్యామిలీ హీరోగా బన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు అని చెప్పవచ్చు. బన్నీ భార్య స్నేహ అలాగే కూతురు అల్లు అర్హ, కొడుకు అయాన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక బన్నీ వారి పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను కూడా సందర్శిస్తూ ఉంటాడు.
గోల్డెన్ టెంపుల్ లో
ఇక నేడు తన భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. ఎప్పటినుంచో గోల్డెన్ టెంపుల్ కు వెళ్లాలి అని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఇటీవల అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి పవిత్ర స్థలం కు చేరుకొని అక్కడ ప్రార్ధనలు కూడా చేశారు. అంతేకాకుండా మత పెద్దల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ గా
ఇక అల్లు అర్జున్ తో పాటు భార్య ఇద్దరు పిల్లలు కూడా ప్రత్యేకంగా అక్కడ ఆచారాలను కూడా పాటించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక వారి పంజాబ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో కూడా పుష్ప సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు బన్నీ వెళ్లడంతో అక్కడికి చాలామంది అభిమానులు కూడా వెళ్లారు. ఇక బన్నీ వారికి ఎంతో ఆప్యాయంగా అభివాదం చేశారు.
పుష్ప సెకండ్ పార్ట్
ఇక అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ షూట్ ను త్వరలో మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈసారి సుకుమార్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ స్థాయిలో సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందుకే అప్పుడే నిర్మాతలకు భారీ స్థాయిలో ఆఫర్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 700 కోట్లకు పైగా సెకండ్ పార్ట్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.