twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాక్‌స్టార్‌గా బన్నీ, ‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రేపే..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియో రేపు(ఏప్రిల్ 28) హైదరాబాద్ లోని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అభిమానులకు పాసులు కూడా జారీ అయ్యాయి.

    ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. చివరగా విడుదలైన జులాయి కూడా సాంగ్స్ కేక అనే టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియోపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ విదేశాల్లో స్థిరపడ్డ రాక్ స్టార్‌గా నటిస్తున్నారు. మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా మహా క్రేజ్. ఇక రాక్ స్టార్‌గా ఇందులో బన్నీ వేసే స్టెప్పులు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

    సినిమా గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'బన్నీలోని కొత్త యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు. పూరీ కెరీర్లో కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా నేపథ్యమే కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. 'టాప్ లేచిపోద్ది..' అనే పల్లవితో సాగే ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుది. ఈ నెల 28న ఆడియో విడుదల చేసి మే 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

    English summary
    Allu Arjun and Amala Paul combinational latest movie Iddarammayitlo audio is getting released on April 28th at Hyderabad in a grand Scale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X