Don't Miss!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఇద్దరమ్మాయిలతో' హీరో క్యారక్టరైజేషన్ పై పూరీ జగన్నాథ్
హైదరాబాద్ : దేశముదురు తర్వాత బన్నీ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్.లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై బన్ని అభిమానుల్లోనే కాక మిగతా వారిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని మరింత పెంచుతూ...రిలీజైన ట్రైలర్ ఆదరణ పొందింది. ఈ నేపధ్యంలో చిత్రం గురించి దర్శక,నిర్మాతలు మాట్లాడారు.
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..అల్లరి... ఆలోచన - ఆ అబ్బాయి ప్రత్యేకతలు. దుమ్ము రేపే జోరుంది. నిజం మాట్లాడతాడు. నిక్కచ్చిగా ఉంటాడు. అతని ఫిలాసఫీ కూడా కొత్తగా ఉంటుంది. 'చుట్టూ ఎవరూ లేనప్పుడు నువ్వేంటో.. అదే నువ్వు..' అంటూ హితోపదేశం చేస్తాడు. అతను ఇద్దరమ్మాయిలతో సాగించిన ప్రయాణం ఎలాంటిదో మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు పూరి జగన్నాథ్.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత పూరి ఓ ప్రేమకథ తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రేమాయణాన్ని చూపించే విధానం అందర్నీ అలరిస్తుంది. అల్లు అర్జున్ నటన, ఆయన కాస్ట్యూమ్స్ కొత్తగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్కి మంచి స్పందన వచ్చింది. నెట్లో లక్షల మంది చూశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు యువతరాన్ని ఆకట్టుకొంటాయి''అన్నారు.
ఇక ఈ చిత్రాన్ని మే 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆడియోని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆడియోని ఏప్రియల్ 28న విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు 21 ఏప్రియల్ ఆడియో తేదీని విడుదల చేసారు. అది ఫోన్స్ ఫోన్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.
స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.