Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'ఇద్దరు అమ్మాయిలతో....' టీజర్ విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ చిత్రం టీజర్ విడుదల తేదీ ఖరారైంది. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రియల్ 18న ఈ టీజర్ ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం స్పానిష్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది.
ఇక ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్,గెటప్స్ దగ్గరనుంచి విభిన్నత చూపించాడనే వార్త ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేస్తోంది. సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే.... ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి.
ఈ చిత్రంలో ఐటం బాంబ్ గా..బాలీవుడ్ నటి దేవషి కందూరిని ఎంపిక చేసారు. ఆమెపై స్పెషల్ గా రీసెంట్ గా స్పెయిన్ లో ఓ పాటను చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని చెప్తున్నారు. ఈ విషయమై దేవషి మాట్లాడుతూ... నేను ఈ పాటలో ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేసాను. ఈ అవకాసం ఇచ్చినందుకు దర్శకుడు పూరీ జగన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ పాటలో నాకు ప్రత్యేకమైన కొరియోగ్రఫీ చేసారు. అదీ బాగా నచ్చింది. అందులోనూ స్పెయిన్ లో ఈ రొమాంటిక్ ఐటం నెంబర్ షూట్ చేయటం నాకు చాలా బాగా నచ్చింది అంది. ప్రస్తుతం ఆమె ది సిటీ నెవర్ స్లీప్స్ చిత్రం చేస్తోంది.
అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.