Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
‘ఇద్దరమ్మాయిలతో’ రిలీజ్ డేట్పై బండ్ల గణేష్ ట్వీట్
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ మేరకు ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసారు. 'ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని మే 10న విడుదల చేస్తున్నాం. బన్నీ కెరీర్లోనే నెం.1 చిత్రం అవుతుంది. ఈ చిత్రం తీస్తున్న పూరి అన్నయ్యకు థాంక్స్' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు.
శర వేగంగా సాగుతున్న ఈచిత్రం ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ తొలిసారిగా ఈచిత్రంలో శరీరంపై టాటూలు వేసుకుని కనిపించనున్నాడు.
సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే....ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అదే విధంగా ఈచిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.
అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.