Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేటి నుంచే...గోవాలో సినిమా పండగ
హైదరాబాద్ : గోవా వేదికగా 45వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవానికి(ఇఫి) రంగం సిద్ధమైంది. నేటి నుంచి 30 వరకు జరగనున్న ఈ ఉత్సవాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ ముఖ్య అతిథులగా ప్రారంభిస్తారు. జియాన్ సూ ఇల్ (దక్షిణ కొరియా), మోహ్సెన్ మక్మల్బఫ్ (ఇరాన్), పాలిస్ దర్శకుడు క్రిజిస్జ్టొఫ్ జానుస్సి కార్యక్రమానికి గౌరవ అతిథులు.
ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ను 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అనే పురస్కారంతో వేడుకలో సత్కరిస్తారు. చైనా దర్శకుడు వోంగ్ కార్ వాయ్కు జీవితకాల సాఫల్య పురస్కారం బహూకరిస్తారు. ఈ ఉత్సవంలో 79 దేశాలకు చెందిన 178 సినిమాలను ప్రదర్శిస్తారు. ఇండియన్ పనోరమా విభాగంలో 26 ఫీచర్, 15 నాన్ ఫీచర్ చిత్రాలను ప్రదర్శిస్తారు.
'గాంధీ' దర్శకుడు రిచర్డ్ అటెన్బర్గ్, రాబిన్ విలియమ్స్, జోహ్రా సెహ్గల్, సుచిత్రా సేన్, ఫారుఖ్ షేక్లకు నివాళిగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇఫిలో చదువుకోవాలి
బాలికల విద్య ఆవశ్యకత నేపథ్యంలో తెరకెక్కిన 'చదువుకోవాలి' చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవంలో సందడి చేయనుంది. ఈ ఉత్సవాల్లో'చదువుకోవాలి'ని ప్రదర్శించనున్నట్లు చిత్ర దర్శకనిర్మాత ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. వివిధ పురస్కారాలు, ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం ఇఫిలో ప్రదర్శనకు ఎంపిక కావడం హర్షణీయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు.