Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహానటికి అరుదైన గౌరవం.. ఇండియన్ పనోరమాకి ఎంపిక
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి జీవిత కథ మహానటిగా తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వసూళ్లతో నీరాజనాలు అందించారు. విమర్శకుల ప్రశంసలూ లభించాయి. ఇప్పుడు మహానటికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమాలో తెలుగు చిత్రసీమ నుంచి ప్రదర్శన కోసం మహానటి ఎంపికైంది.
కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ ఐ) ఉత్సవాలు త్వరలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా మహానటిని ప్రదర్శిస్తారు.
హిందీ, తమిళ, మలయాళం, తుళు... ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ లో మాత్రం భారతదేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్రదర్శనకు ఎంపిక చేశారు. అందులో దక్షిణాది నుంచి ఒక్క మహానటికే స్థానం దక్కింది.