twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ధోనీ’ ఆడియో వేడుకలో ఇళయరాజా లైవ్ షో

    By Bojja Kumar
    |

    ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ధోనీ' సినిమా ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 30న సినిమా ఆడియో వేడుక ఉన్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారని, ఆడియో సంగీత ప్రియులతో పాటు సాహిత్య ప్రియులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆడియో వేడక సందర్భంగా ఇళయరాజా తన బృందంతో లైవ్ షో ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకోనుందని తెలిపారు.

    నేటి విద్యా వ్యవస్థను ప్రశ్నించే అంశాలతో పాటు, తల్లిదండ్రులు...విద్యా సంస్థలు తీరును ఎండగడుతూ సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోంది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రకాష్ రాజ్, పూరి తనయుడు ఆకాష్ తండ్రి కొడుకులుగా నటించనున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో రాధిక ఆప్టే, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, నాజర్, అనంత్, గుండు హనుమంతరావు, మురళీ శర్మ, కస్తూరి హరి తదితరులు నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మాటలు: టి.జె.జ్ఞానవేల్, మహేష్ రాజా, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటర్ : కిషోర్, బ్యానర్: డ్యూయోట్ మూవీస్, నిర్మాత, దర్శకత్వం: ప్రకాష్ రాజ్

    English summary
    The audio launch of Dhoni will take place on January 30. For the first time, maestro Ilayaraja will conduct a live orchestra at the audio launch and it is going to be a musical treat for all his fans out there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X