Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 72 మందికి పద్మశ్రీ పురస్కరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలు పలువురికి రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 41 మందికి పద్మ పురస్కారాల ప్రదానం జరిగింది. మిగిలిన వారికి ఏప్రిల్ 2న అవార్డులు ప్రదానం చేయనున్నారు.
For his unparalleled contribution to music. #PeoplesPadma pic.twitter.com/02FV5zRMNG
— PMO India (@PMOIndia) March 20, 2018
ఇళయారాజకు అవార్డు ప్రధానం అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన కూడా విడుదలైంది. సంగీత రంగానికి ఇళయారాజా అందించిన విశేషసేవలకుగాను ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు.