Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 72 మందికి పద్మశ్రీ పురస్కరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలు పలువురికి రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 41 మందికి పద్మ పురస్కారాల ప్రదానం జరిగింది. మిగిలిన వారికి ఏప్రిల్ 2న అవార్డులు ప్రదానం చేయనున్నారు.
For his unparalleled contribution to music. #PeoplesPadma pic.twitter.com/02FV5zRMNG
— PMO India (@PMOIndia) March 20, 2018
ఇళయారాజకు అవార్డు ప్రధానం అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన కూడా విడుదలైంది. సంగీత రంగానికి ఇళయారాజా అందించిన విశేషసేవలకుగాను ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు.