Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాగా నచ్చింది..కానీ ప్లాపైంది: ఇలియానా
'నేను నా రాక్షసి' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో నా పాత్ర మలచిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. అంత మాత్రాన పాత్రల ఎంపిక నాకు రాదని కాదు కదా. కొన్ని కొన్ని విషయాల్లో మేం ఏమీ చేయలేం'' అని చెప్తోంది ఇలియానా. ఆమె మరోసారి పూరీ జగన్నాధ్ తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులలో నటిస్తోంది. ఆ చిత్రంలో ఆమె రవితేజ సరసన చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.
అలాగే ... ఓ సినిమా ఎందుకు బాగా ఆడింది? ఇంకో సినిమా ఎందుకు నచ్చలేదు? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. నా మనసుకి నచ్చినంత మాత్రాన ప్రతీ సినిమా విజయవంతం కావాలనేం లేదు కదా...ఏ పని చేసినా నేను పూర్తిగా అందులో లీనమైపోతాను అంది ఇలియానా. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అల్లుఅర్జున్ సరసన జోడీ కట్టింది. 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్లోనూ అడుగుపెడుతోంది. ఆమె శంకర్ దర్శకత్వంలో తమిళంలో నటించిన త్రీ ఇడియట్స్ రీమేక్ తెలుగులో స్నేహుతుడా పేరుతో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.