Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ ముగ్గురు హీరోలతో నటిస్తా: ఇలియానా
ఇలియానా మాట్లాడుతూ... ''తొలి ప్రయత్నంలోనే రణ్బీర్ కపూర్తో కలిసి నటించాను. ఇటీవల షాహిద్ కపూర్తోనూ జతకట్టాను. ఇప్పుడు నా దృష్టి ఖాన్ త్రయంమీదే ఉంది. షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్, అమీర్ఖాన్లతో పాటు హృతిక్రోషన్తో కూడా తెరను పంచుకోవాలని ఉంది. ఏదో ఓ రోజు ఈ లక్ష్యాలన్నీ చేరుకొంటానన్న నమ్మకం ఉంది. డబ్బు, అవకాశాలు అని కాకుండా... నటనను ఆస్వాదిస్తున్నాను. నా సినీ జీవితంలో కీలక దశ ఇదే'' అని చెప్పుకొచ్చింది ఇలియానా.
అలాగే ...''అందంపైనే ఆధారపడాలనుకోలేదు. తెరపై కేవలం అందాలు ఆరబోయాలి, అవకాశాలు రాబట్టుకోవాలని అనుకొని ఉంటే 'బర్ఫీ'లాంటి చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టేదాన్ని కాదు. నటిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం'' అంటోంది ఇలియానా. తెలుగులో రామ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం 'కందిరీగ'. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 'మై తేరా హీరో' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఖరారు చేసి చెప్పారు.
బర్ఫీతో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం షాహిద్ కపూర్తో నటిస్తోంది. ఇప్పుడు మూడో చిత్రం కూడా సిద్ధమైంది. త్వరలో ఆమె సైఫ్ అలీఖాన్తో కలిసి నటించబోతోంది. ఈ సినిమాకి రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె. సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. సైఫ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో చిత్రీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.