Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముంబైలో తెలుగు హీరోతో ఇలియానా
నేనూ.. నా రాక్షసి చిత్రంలో జంటగా చేసిన రాణా, ఇలియానా ఆ కాంబినేషన్ ని నిజ జీవితంలోనూ కంటిన్యూ చేస్తున్నారు. వారిద్దరూ ముంబైలో తమ ప్రమోషన్ కోసం ఒకే పీఆర్ ఏజన్సీని నియమించుకున్నారు. ఇద్దరూ కలిసే ఆ ఏజన్సీ వారితో మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఇక ఇలియానా ప్రస్తుతం హిందీలో బర్ఫీ అనే చిత్రం చేస్తోంది. రాణా.. వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ చేస్తున్నారు. వీరిద్దరనీ కలిపిన పూరీ జగన్నాధ్ హిందీలో ది బిజెనెస్ మ్యాన్ చిత్రం చేయటానకి ప్లానింగ్ లో ఉన్నారు.
ఇక ఇలియానా,రాణా ముంబైలో తరుచూ కలుస్తూంటారని,ఇలియానా కోసం రాణా ..ఆమె చేస్తున్న షూటింగ్ లొకేషన్స్ కు కూడా వెళ్ళి వస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇద్దరూ బాలీవుడ్ కి కొత్త కావటంతో అక్కడ మీడియ వారిపై ఫోకస్ చేయటం లేదు. ఇక డిపార్టమెంట్ లో చేస్తూండటంతో రాణా కంటిన్యూగా ముంబైలోనే ఉంటారు. కాబట్టి వీరిద్దరూ అక్కడ తరుచుకూ కలుసుకోవచ్చని, రెగ్యులర్ గా పబ్ లకు వెళ్లవచ్చని, హైదరాబాద్ లో దొరకని స్వేచ్చ వారికి అక్కడ దొరుకుతుందని అంటున్నారు. ఇక నేనూ నా రాక్షసి అనంతరం ఇలియానాకు తెలుగులో ఏ ఆఫరూ రాలేదు. రాణా మాత్రం ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో నా ఇష్టం చేస్తున్నాడు.