తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోయిన్
రెమ్యునేషన్ లో ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారనే పోటీ పరిశ్రమ పుట్టిననాటి నుంచీ ఉన్నదే. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోయిన్ గా ఇలియానా నమోదు అయింది. ఆమె తాజా చిత్రానికి కోటిన్నర ఆమె డిమాండ్ చేసి మరీ సైన్ చేసిందని సమాచారం. అది మహేష్ తో శంకర్ దర్సకత్వంలో చేయనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ కోసమని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇలియానా...పూరీ జగన్నాధ్ దర్సకత్వంలో నేనూ..నా రాక్షసి అనే చిత్రం చేస్తోంది. మోడ్రన్ టచ్ ఉన్న విభిన్నమైన ప్రేమ కథగా ఆ చిత్రాన్ని చెప్తున్నారు. రానా ..లీడర్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం తమిళ,హిందీ బాషల కోసం కూడా టార్గెట్ చేస్తున్నారు.
More from Filmibeat
రాణా పూరీ జగన్నాధ్ నేను నా రాక్షసి లవ్ స్టోరీ ఇలియానా rana puri jagannath nenu naa rakshashi love story iliyana


Click it and Unblock the Notifications











