Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబు అభిమానులకు ఇది శుభవార్తేనా? మహర్షి టీమ్ రిస్క్ చేస్తోందా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సర్ప్రైజ్ చేసేలా మహర్షి చిత్రయూనిట్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుందట. మహర్షి సినిమాలో మరో రెండు లేదా మూడు సీన్స్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై ఆఫీసియల్ స్టేట్మెంట్ రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఇది తమకు శుభవార్తేనా? లేక తమ అభిమాన హీరోకి లేని సమస్యలు తెచ్చి పెడుతుందా? అని తలలు పట్టుకుంటున్నారు.
మే 9 వ తేదీన విడుదలైన మహర్షి సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రంలో మహేష్ని మూడు విభిన్న క్యారెక్టర్లలో చూపిస్తూ ఆయన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఇక రైతు నేపథ్యంలో తెరకెక్కిన కొన్ని సీన్స్, చిత్రంలో పొందుపర్చిన సామాజిక అంశాలు మహర్షి రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ చిత్ర నిడివి బాగా ఎక్కువైందనే టాక్ మాత్రం ఎక్కువ మంది నుంచి వినిపించింది. అయినప్పటికీ ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
ఇలాంటి సిచ్యుయేషన్లో మహర్షి యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందట. మహర్షి లో మరో రెండు సీన్స్ యాడ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఫస్టాఫ్లో హీరో మహేష్ కు పూజా ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ సమయంలో వచ్చే ఓ సీన్ ఎడిటింగ్లో కట్ చేశారు. అలాగే సెకండాఫ్లో కూడా రెండు ఎమోషన్ సీన్స్ కట్ చేశారు. ఇప్పుడు ఆ సీన్స్ని అతికించి చిత్ర నిడివిని మరింత పెంచే సాహసం చేయబోతోంది మహర్షి యూనిట్. ఇప్పటికే నిడివి విషయమై పెద్ద చర్చ జరుగుతుంటే మళ్లీ ఇదెక్కడి గోల బాబు అని మహేష్ అభిమానులు తలలు పట్టుకున్నారు. చూడాలి మరి ఈ సాహసం ఎంత వరకు సక్సెస్ అవుతుందో.
సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో 25 వ సినిమాగా మహర్షి రూపొందించబడింది. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు.